ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలు అధికారులు నన్ను వేధించారు: జామియా విద్యార్థి

ABN, First Publish Date - 2020-09-23T02:29:33+05:30

కోర్టు ముందు ఫాతిమా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దరఖాస్తును కోర్టుకు ఇవ్వమని ఆమె లాయన్‌ను జడ్జ్ సూచించారు. దానికి ఆయన తప్పకుండా ఇస్తానని జడ్జికి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తనను జైలు అధికారులు మానసికంగా వేధించారని ఉపా చట్టం కింద అరెస్టైన జామియా విద్యార్థి గుల్ఫిషా ఫాతిమా తెలిపారు. సోమవారం ఢిల్లీ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సమయంలో సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ముందు ఈ విషయం చెప్పుకుని ఆమె బోరున విలపించారు. జామియా మిలియా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న ఫాతిమాను.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఫిభ్రవరిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె తీహార్‌లో జైలు శిక్ష అనుభవస్తున్నారు.


‘‘నాకు జైలులో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జైలు అధికారులు, ఉద్యోగుల నుంచి చాలా వివక్షను ఎదుర్కొంటున్నాను. వాళ్లు నన్ను ‘చదువుకున్న ఉగ్రవాది’ (ఎడ్యూకేటెడ్ టెర్రరిస్ట్) అని నిందిస్తున్నాను. అంతే కాకుండా మతతత్వ పరంగా నన్ను వేధిస్తున్నారు. ఇక్కడ చాలా మానసిక వేధింపులకు గురవుతున్నాను. నాకేదైనా జరిగితే అది పూర్తిగా జైలు అధికారులదే బాధ్యత’’ అని కోర్టు ముందు గుల్ఫిషా ఫాతిమా చెప్పుకొచ్చారు.


కోర్టు ముందు ఫాతిమా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దరఖాస్తును కోర్టుకు ఇవ్వమని ఆమె లాయన్‌ను జడ్జ్ సూచించారు. దానికి ఆయన తప్పకుండా ఇస్తానని జడ్జికి తెలిపారు.

Updated Date - 2020-09-23T02:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising