గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు
ABN, First Publish Date - 2020-07-09T02:52:04+05:30
గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు
గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు కొత్తగా గుజరాత్ రాష్ట్రంలో 783 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,419 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ 16 మంది మృతి చెందగా, మొత్తం 1,995 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇవాళ కరోనా నుంచి కోలుకున్న 569 మంది బాధితులను డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 27,313 మంది కోలుకున్నారని వైద్య శాఖ వెల్లడించింది.
Updated Date - 2020-07-09T02:52:04+05:30 IST