జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం
ABN, First Publish Date - 2020-06-23T16:05:22+05:30
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని శ్రీజగన్నాథ్ దేవాలయంలో మంగళవారం జరిగిన జగన్నాథ రథయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు....
అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని శ్రీజగన్నాథ్ దేవాలయంలో మంగళవారం జరిగిన జగన్నాథ రథయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆలయం ఆవరణలో జగన్నాథ రథయాత్ర జరిపారు. రథయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విజయ్ రూపానీ ఆలయ ట్రస్టీలతోపాటు మహంతులను అభినందించారు. జగన్నాథ రథయాత్రకు హైకోర్టు అనుమతించక పోవడంతో ఆలయ ట్రస్టీలు, మహంతులు ఆలయ ఆవరణలో జగన్నాథ రథయాత్ర చేపట్టారు.
Updated Date - 2020-06-23T16:05:22+05:30 IST