ప్రణాళిక లేకుండా లాక్డౌనా?: సోనియా
ABN, First Publish Date - 2020-04-03T09:23:43+05:30
ముందస్తు ప్రణాళిక లేకుండా దేశమంతటా లాక్డౌన్ విధించి లక్షలాది మంది వలస కార్మికులను, సామాన్య ప్రజానీకా న్ని కేంద్రప్రభుత్వం ఎనలేని ఇక్కట్ల పాల్జేసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ముందస్తు ప్రణాళిక లేకుండా దేశమంతటా లాక్డౌన్ విధించి లక్షలాది మంది వలస కార్మికులను, సామాన్య ప్రజానీకా న్ని కేంద్రప్రభుత్వం ఎనలేని ఇక్కట్ల పాల్జేసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘ఆహారం, నిలువ నీడ లేకుండా లక్షల మంది పేద ప్రజలు నడిచిపోతూండ డం చూస్తుంటే గుండె తరుక్కుపోతోం ది. ఇది కేంద్ర సర్కారు వైఫల్యమే’ అని ఆమె దుయ్యబట్టారు. దేశంలోని వలస కార్మికులందరికీ కనీస ఉమ్మడి సహాయ కార్యక్రమాన్ని అమలు చేయాలని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా డిమాండ్ చేశారు.
రాజకీయం వద్దు: షా
రాజకీయాలు మాని జాతి హితం గురించి కాంగ్రెస్ ఆలోచించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ‘మోదీసర్కారు చర్యలను దేశం, ప్రపంచం శ్లాఘించాయి. కాంగ్రె స్ మాత్రం తప్పుబడుతోంది. 130 కోట్ల ప్రజానీకం వైర్సను జయించాలన్న కృతనిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తోంది’ అని షా ట్వీట్ చేశారు.
Updated Date - 2020-04-03T09:23:43+05:30 IST