ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దినాజ్‌పూర్ బాధిత కుటుంబాన్ని కలుస్తాం: పశ్చిమబెంగాల్ మంత్రి

ABN, First Publish Date - 2020-07-20T03:22:04+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో హత్యాచారానికి గురైన 16 సంవత్సరాల బాలిక కుటుంబసభ్యులను కలుస్తామని పశ్చిమబెంగాల్ మంత్రి గౌతం దేవ్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో హత్యాచారానికి గురైన 16 సంవత్సరాల బాలిక కుటుంబసభ్యులను కలుస్తామని పశ్చిమబెంగాల్ మంత్రి గౌతం దేవ్ చెప్పారు. ఘటన విషాదకరమైందన్న ఆయన దీన్ని రాజకీయం చేయదలచుకోలేదన్నారు. విచారణ జరిపి దోషులను చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను సీఎం మమత కలుస్తారా లేదా అనేది తెలియరాలేదు.


అంతకు ముందు బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు వాహనాలకు నిప్పుబెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు.  



మరోవైపు బాధితురాలు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సోదరి అని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ విమర్శించింది. 


ఈ ఉదయం దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు. 

Updated Date - 2020-07-20T03:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising