గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్కు రూ. 124 కోట్లు
ABN, First Publish Date - 2020-07-13T21:00:56+05:30
కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు.
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. దాదాపు 20 లక్షల లావాదేవీల ద్వారా ఈ మొత్తం పీఎమ్ కేర్స్కు చేరిందన్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్ నిధికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. పీఎమ్ కేర్స్కు గూగుల్ పే వంటి యూపీఐ యాప్ ద్వారా విరాళాలిచ్చే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.
కాగా.. ఈ ఈవెంట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగించారు. భారత్లో డిజిటలీకరణ కోసం గూగుల్ చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్కు చెందిన వివిధ రంగాలలో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని పిచాయ్ ఈ సందర్భంగా తెలిపారు.
Updated Date - 2020-07-13T21:00:56+05:30 IST