భారత్ నిషేధించిన చైనా యాప్స్పై గూగుల్ కీలక ప్రకటన
ABN, First Publish Date - 2020-07-03T02:22:14+05:30
చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిషేధం విధించిన 59 చైనా యాప్స్కు...
న్యూఢిల్లీ: చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిషేధం విధించిన 59 చైనా యాప్స్కు సంబంధించి గూగుల్ గురువారం కీలక ప్రకటన చేసింది. భారత్ బ్యాన్ చేసిన చైనా యాప్స్ను ప్లే స్టోర్లోనే ఉంచామని.. అయితే భారత్లో అందుబాటులో లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సదరు యాప్స్ డెవలపర్స్కు కూడా సమాచారం అందించామని తెలిపింది. అయితే.. బ్యాన్ చేసిన యాప్స్లో ఎన్ని యాప్స్ను బ్లాక్ చేశారో గూగుల్ ప్రతినిధి స్పష్టత ఇవ్వలేదు.
అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సదరు యాప్స్ డెవలపర్లే గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్వచ్ఛందంగా యాప్స్ను తొలగించినట్లు తెలిసింది. భారత్.. సోమవారం నాడు చైనా యాప్స్ అయిన టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, వుయ్చాట్ యాప్స్తో సహా 59 యాప్స్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-07-03T02:22:14+05:30 IST