ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుల్లో భౌతిక దూరానికి గుడ్‌బై.. ఆందోళనలో ఆరోగ్యశాఖ

ABN, First Publish Date - 2020-06-05T13:59:13+05:30

రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణించడంపై ఆరోగ్యశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణించడంపై ఆరోగ్యశాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సహా నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలివిడతగా 5,500 బస్సులు నడుపుతున్నట్టు, ఒక్కో బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా 20 లేదా 30 మంది ప్రయా ణికులు ఎక్కించుకోనున్నట్టు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది. కానీ, పలు మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంటూ బస్సులను కూడా తగ్గించారు. దీంతో బస్సు కోసం విధులు, పనులకు వెళ్లేవారు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఒకే ఒక బస్సు రావడంతో ప్రజలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా ఇలాంటి చర్యలతో మరింత ప్రబలే అవకాశముందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, తగినన్ని బస్సులు నడపాలని ఆరోగ్యశాఖ నిపుణులు, సంఘసేవకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-06-05T13:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising