ఇద్దరమ్మాయిల ప్రేమ వ్యవహారం.. చివరకిలా పెళ్లితో ముగిసింది..!
ABN, First Publish Date - 2020-02-14T15:56:32+05:30
ఇద్దరు యువతులు వివాహం తాజాగా ఉత్తరపద్రశ్లో సంచలన రేకెత్తిస్తోంది.
మల్కాన్గిరి (ఒడిశా): ఇద్దరు యువతులు వివాహం తాజాగా ఒడిశాలో సంచలన రేకెత్తిస్తోంది. మల్కాన్గిరి జిల్లా ఎమ్వీ గ్రామానికి చెందిన సీత, గీత(పేర్లు మార్చాం) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చుట్టూ ఉన్న సమాజాం తమ బంధాన్ని అంగీకరించదని వారికి అర్థమైంది. వారి బంధం పెళ్లి దాకా వెళ్లకపోవచ్చనే భయం వారిని వెంటాడింది. ఈ క్రమంలో లింగమార్పిడి ఆపరేషన్లో వారికి పరిష్కారం కినిపించింది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు కూడా సరేననడంతో వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారారు. గురువారం నారు బంధువులు పెద్దల సమక్షంలో ఒకట్టయ్యారు. ఈ పెళ్లి స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
Updated Date - 2020-02-14T15:56:32+05:30 IST