అన్నీ మర్చిపోయి క్షమించండి
ABN, First Publish Date - 2020-08-13T07:38:56+05:30
కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీలోకి తిరిగి వచ్చిన తరువాత వారిలో ఆగ్రహం సహజమేనని, అయితే అన్నీ మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు...
- అసంతృప్తి ఎమ్మెల్యేలకు రాజస్థాన్ సీఎం గెహ్లాట్ బుజ్జగింపు
జైసల్మేర్/జైపూర్, ఆగస్టు 12: కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీలోకి తిరిగి వచ్చిన తరువాత వారిలో ఆగ్రహం సహజమేనని, అయితే అన్నీ మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. శాసనసభ సమావేశాలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వారినందరినీ కలిపి రాజధానిలోని ఒక రిసార్ట్లో ఉంచాలని పార్టీ నిర్ణయించింది. అంతకుమించి పార్టీకి మరో మార్గం లేదు. జైసల్మేర్ గెహ్లాట్ క్యాంపులోని కలిసి ఉన్న ఎమ్మెల్యేలు బుధవారం తిరిగి జైపూర్ వెళ్లారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా నగర శివారులోని ఫెయిర్మాంట్ హోటల్కు తీసుకెళ్లారు.
Updated Date - 2020-08-13T07:38:56+05:30 IST