నూతన కాగ్ జీసీ ముర్ము ప్రమాణ స్వీకారం
ABN, First Publish Date - 2020-08-08T16:32:35+05:30
భారత నూతన ‘కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్)గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం..
న్యూఢిల్లీ: భారత నూతన ‘కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్)గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి కోవిడ్-19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. కాగా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము రెండు రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-08-08T16:32:35+05:30 IST