ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మదురైలో సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-06-23T14:32:06+05:30

నేటి నుంచి మదురైలో సంపూర్ణ లాక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా బాధితుల సంఖ్య పెరుగు తుండడంతో మదురైలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువ ళ్లూర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా అధికంగా ఉన్న జిల్లాలో మదురై కూడా చేరింది. ఆదివారం ఒకేరోజు జిల్లాలో 68 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 705కు పెరిగింది. ఈ క్రమంలో మదురైలో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా బుధవారం నుంచి దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరచి ఉంచాలని వ్యాపార సంఘాలు నిర్ణయించారు. అదే సమయంలో దుకాణాల ముందు ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని జిల్లా ఎస్పీ మణివన్నన్‌ విజ్ఞప్తి చేశారు. కాగా, చెన్నై సహా నాలుగు జిల్లాలతో పాటు మదురై జిల్లాలోను ఈ నెల 30వ తేది వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-06-23T14:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising