ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉజ్వల’ లబ్దిదారులకు జూన్ వరకు ఉచితంగా గ్యాస్

ABN, First Publish Date - 2020-03-27T14:13:25+05:30

కరోనా నేపథ్యంలో పేదలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త వెల్లడించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జూన్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి 

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో పేదలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త వెల్లడించారు.  కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలోని ‘ఉజ్వల’ ఎల్‌పీజీ కనెక్షన్లున్న వినియోగదారులకు జూన్ నెలాఖరు వరకు ఉచితంగా గ్యాస్ అందిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు.


లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలోని గ్రామాలు, పట్టణాల్లో పేదలు, రైతులు, వలస కార్మికులకు ఆహారం అందించేందుకు వీలుగా నిత్యావసర సరకులతోపాటు గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో 3.18 కోట్లమందికి ఉజ్వల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వీరందరికీ ఉచితంగా జూన్ నెలాఖరు వరకు గ్యాస్ ను సరఫరా చేస్తామని మంత్రి వివరించారు. 

Updated Date - 2020-03-27T14:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising