ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్‌పీఎఫ్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-05-26T00:43:49+05:30

దేశ రాజధానిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో నలుగురు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి కరోనా పాజిటివ్ అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో నలుగురు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంతవరకూ కరోనా వైరస్ బారిన పడిన వారి (సీఆర్‌పీఎఫ్) సంఖ్య 363కు చేరింది. వీటిలో 220 యాక్టివ్ కేసులు ఉండగా, ఇద్దరు మృతి చెందినట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.


కాగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య సోమవారంనాడు 14,053కు చేరినట్టు రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ బులిటెన్ తెలిపింది. వీటిలో 7,006 యాక్టివ్ కేసులు ఉండగా, 6,771 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరింది. మృతుల సంఖ్య 276కు చేరింది. 50కి పైగా పడకలు ఉన్న అన్ని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్ల కోసం 20 శాతం పడకలు రిజర్వ్ చేయాలని ఢిల్లీ సర్కార్ ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో 88 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి.

Updated Date - 2020-05-26T00:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising