ఆఫ్ఘనిస్థాన్లో మందుపాతర పేలుడు...నలుగురు పౌరుల మృతి
ABN, First Publish Date - 2020-08-13T18:49:23+05:30
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కందహార్ ప్రావిన్సులో గురువారం ఉదయం మందుపాతర పేలుడు ఘటనలో నలుగురు పౌరులు మరణించగా....
కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్) : ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కందహార్ ప్రావిన్సులో గురువారం ఉదయం మందుపాతర పేలుడు ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. పంజావాయి జిల్లాలో గురువారం జరిగిన మందుపాతర పేల్చివేత ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు, మరో నలుగురు పిల్లలు, ఓ మహిళ, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 9వతేదీన అర్గిస్థాన్ జిల్లాలో జరిగిన మరో పేలుడులో 8 మంది పౌరులు మరణించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
Updated Date - 2020-08-13T18:49:23+05:30 IST