ఎన్నికల వేళ... ఆర్జేడీ నేత కాల్చివేత
ABN, First Publish Date - 2020-10-04T20:51:35+05:30
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రాష్ట్ర మాజీ కార్యదర్శి శక్తి మాలిక్ను కొందరు దుండగులు కాల్చిచంపారు. పూర్ణియా జిల్లాలో..
పునియా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) రాష్ట్ర మాజీ కార్యదర్శి శక్తి మాలిక్ను కొందరు దుండగులు కాల్చిచంపారు. పూర్ణియా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు శక్తి మాలిక్పై ఆయన నివాసం వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని, దీనిపై దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ ఆనంద్ పాండే తెలిపారు. కాగా, ఇంటి పెరట్లో పిల్లలకు ఆహారం తినిపిస్తుండగా ముసుగులో వచ్చిన ముగ్గురు గూండాలు తన భర్తను కాల్చిచంపి పరారైనట్టు పాండే భార్య కుష్బూ దేవి తెలిపింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కొందరు పార్టీ నేతలు శత్రుత్వం కారణంగానే ఈ పని చేసి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనమైంది.
Updated Date - 2020-10-04T20:51:35+05:30 IST