ఎన్సీపీలో బీజేపీ మాజీ నేత ఏక్నాథ్ చేరిక
ABN, First Publish Date - 2020-10-24T08:38:50+05:30
బీజేపీకి బుధవారం రాజీనామా చేసిన ఏక్నాథ్ ఖడ్సే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. అధ్యక్షుడు శరద్ పవార్ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్...
ముంబై, అక్టోబరు 23: బీజేపీకి బుధవారం రాజీనామా చేసిన ఏక్నాథ్ ఖడ్సే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. అధ్యక్షుడు శరద్ పవార్ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్.. ఖడ్సేకు కండువా కప్పారు. ఖడ్సే ఇంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. భూకబ్జా ఆరోపణలపై 2016లో నాటి దేవేంద్ర ఫడణవీస్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు.
Updated Date - 2020-10-24T08:38:50+05:30 IST