కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
ABN, First Publish Date - 2020-10-21T09:17:15+05:30
కశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్, అక్టోబరు 20: కశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో ఇద్దరు, పుల్వామా జిల్లాలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని జైనాపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఘటనలో పుల్వామా జిల్లాలోని హర్కీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
Updated Date - 2020-10-21T09:17:15+05:30 IST