కర్ణాటక: బస్సులో మంటలు, ఐదుగురు మృతి
ABN, First Publish Date - 2020-08-12T14:44:26+05:30
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
బెంగళూరు: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనంకాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2020-08-12T14:44:26+05:30 IST