ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో తొలి కరోనా బాధితులు కోలుకున్నారు..

ABN, First Publish Date - 2020-03-25T21:11:48+05:30

మహారాష్ట్రలో తోలిసారి కరోనా బారినపడ్డ వారు కోలుకున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో ఏ స్థాయిలో విరుచుకు పడుతుందో తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే కరోనా కేసులు 100 దాటాయి. దీంతో దేశంలో కూడా కరోనా కేసులు 590కు చేరాయి. కరోనాతో పోరులో భాగంగా మహారాష్ట్రలో ఇప్పటికే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తోలిసారి కరోనా బారినపడ్డ వారు కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పూనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. రెండువారాల చికిత్స అనంతరం ఇద్దరు వ్యక్తులకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయని వారు చెప్పారు. 'ఈ ఇద్దరికి రెండుసార్లు పరీక్షలు జరిపాం. రెండుసార్లూ నెగిటివ్ ఫలితాలే వచ్చాయి. బుధవారం వీరిని డిశ్చార్జి చేసేస్తాం' అని అధికారులు ప్రకటించారు.


Updated Date - 2020-03-25T21:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising