ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై పోలీసు కేసు

ABN, First Publish Date - 2020-06-23T11:47:01+05:30

మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ సర్కారు పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్): మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ సర్కారు పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసింది. టీఎంసీ కార్యకర్తల దాడిలో డాంటాన్ పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త పవన్ జన మరణించారు. పవన్ జనకు నివాళులు అర్పించేందుకు సామాజిక దూరం పాటించకుండా బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తోపాటు బీజేపీ  నాయకులు సుభాష్ నగర్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ అధినేతతోపాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బోస్, ఎంపీ పురూలియా జ్యోతిర్మయి, మిడ్నాపూర్ బీజేపీ అధ్యక్షుడు సమిత్ దాస్, మరో 150 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశమై సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించారని మిడ్నాపూర్ కొత్వాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఫేస్ మాస్క్ లు ధరించ కుండా మిడ్నాపూర్ నగరంలో మోటార్ సైకిలు ర్యాలీ తీశారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-23T11:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising