లాలుప్రసాద్ యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు
ABN, First Publish Date - 2020-11-27T01:18:15+05:30
ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ ఆయనపై పోలీసులకు
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితిశ్ కుమార్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తనకు సహకరిస్తే ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తామని ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారంటూ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. లలన్ పాశ్వాన్ థానా పాట్నాలో లాలుప్రసాద్పై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేసు పెట్టినట్టు బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్.. బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్కు ఫోన్ చేసి బేరసారాలు సాగించినట్టు మంగళవారం రాత్రి సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. ఆ వెంటనే లాలాప్రసాద్ మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Updated Date - 2020-11-27T01:18:15+05:30 IST