ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు ప్రేమించిన యువతిపై తండ్రి అత్యాచారం

ABN, First Publish Date - 2020-03-15T15:58:20+05:30

కొడుకు ప్రేమించిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి సహా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కొడుకు ప్రేమించిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగపట్టణం జిల్లా వేదారణ్యం తాలూకాలో ఓ గ్రామానికి యువతికి (21)కి సోంపేట గ్రామానికి చెందిన కరుంబు నిత్యా నందం కుమారుడు ముఖేష్‌ (20)తో వృత్తి విద్యా కోర్సు అభ్యసిస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, యువతి ఇంటికి ముఖేష్‌ తండ్రి నిత్యానందం వెళ్లి వివాహం చేస్తానని ఆమెకు చెప్పి ఆ యువతిని తీసుకెళ్లి సోంపేటలోని ఓ దుకాణంలో బంధించి తాళి కట్టి అత్యాచారం చేశాడు. 


అనంతరం ఆమెను అవరిక్కాడు గ్రామంలోని బంధువుల ఇంట్లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పిం చుకున్న ఆ యువతి వేదారణ్యం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు, నిత్యానందం సహా అతని బంధువులు శక్తివేల్‌, మౌనరాజవల్లిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సెల్వనాగరత్నం సిఫార్సు తో జైలులో ఉన్న నిత్యానందంను గూండాచట్టం కింద అరెస్ట్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రవీణ్‌పినాయర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-03-15T15:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising