ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుశాంత్ కేసు: రెండోసారి రియా చక్రవర్తిని విచారిస్తున్న ఈడీ

ABN, First Publish Date - 2020-08-10T19:40:37+05:30

సుశాంత్ డెత్ మిస్టరీ కేసులో నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సుశాంత్ డెత్ మిస్టరీ కేసులో నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రియా చక్రవర్తి సోమవారం రెండోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె తన సోదరుడితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వచ్చారు. సుశాంత్ మరణంతో మనీ ల్యాండరింగ్ వ్యవహారం ముడిపడి ఉందన్న అనుమానంతో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.


సుశాంత్ ప్రియురాలు.. నటి రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం 8 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె ఆదాయ, పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబై నగరంలోని ఘర్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్థికి సంబంధించి రియా చక్రవర్తిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సుశాంత్ నుంచి తీసుకున్న డబ్బుతో ఈ స్థిరాస్తిని రియా కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రియా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలియవచ్చింది. ఈ సమాధానాలతో సంతృప్తి చెందకపోవడంతో ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు పిలిచారు.

Updated Date - 2020-08-10T19:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising