ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో బలగాల ఉపసంహరణ సరిహద్దుల్లో నిలకడగా పరిస్థితులు: చైనా

ABN, First Publish Date - 2020-11-27T08:01:09+05:30

తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్‌, చైనాలు స్పష్టమైన, లోతైన సమాచార మార్పిడి, సమన్వయాన్ని కొనసాగించాయని చైనా మిలిటరీ పేర్కొంది. ఉద్రిక్తతలకు స్వస్తి పలకడంలో భాగంగా ఇరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, నవంబరు 26: తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్‌, చైనాలు స్పష్టమైన, లోతైన సమాచార మార్పిడి, సమన్వయాన్ని కొనసాగించాయని చైనా మిలిటరీ పేర్కొంది. ఉద్రిక్తతలకు స్వస్తి పలకడంలో భాగంగా ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య ఈ నెల 6న జరిగిన చర్చల అనంతరం సరిహద్దుల్లో పరిస్థితు లు నిలకడగా ఉన్నాయని చైనా జాతీయ రక్షణశాఖ ప్రతినిధి, సీనియర్‌ కల్నల్‌ రెన్‌ గుయోకియాంగ్‌ వివరించారు. సైనిక దళాలు సంయమనం పాటించే అంశంపై చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి ఎటువంటి అపోహలు, అపార్థాలకు తావులేకుండా ఇరుపక్షాలు మనస్ఫూర్తిగా అంగీకరించాయన్నారు. భారత్‌తో సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగించడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలను కాపాడటానికి భారత్‌ సానుకూల వైఖరితో చైనాకు సహకరిస్తుందని ఆశిస్తున్నామని గుయోకియాంగ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-27T08:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising