రాజస్థాన్లో భూకంపం...భయాందోళనల్లో జనం
ABN, First Publish Date - 2020-08-13T14:04:44+05:30
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.....
బికనేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు చెప్పారు. గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం 30 కిలోమీటర్ల లోతులో వచ్చింది. భూకంపంతో నిద్రలో ఉన్న వారు భయాందోళనలు చెంది బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
Updated Date - 2020-08-13T14:04:44+05:30 IST