ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బ్రేక్

ABN, First Publish Date - 2020-09-18T18:15:41+05:30

ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బ్రేక్ వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానాలకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ బ్రేక్ వేసింది.  గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను అక్టోబరు 2వతేదీ వరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిలిపివేసినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారులు శుక్రవారం చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తన ప్రయాణానికి 96 గంటల ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి.


 కొవిడ్  పాజిటివ్ సర్టిఫికెట్ ఉన్న ఓ ప్రయాణికుడు సెప్టెంబరు 4వతేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్‌లో జైపూర్ నుంచి దుబాయ్ విమానంలో ప్రయాణించారు.ఇంతకు ముందు దుబాయ్ విమానాల్లో ఇలాంటి ఘటన జరిగింది. దీనివల్ల సెప్టెంబరు 18వతేదీ నుంచి అక్టోబరు 2వతేదీ వరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఎయిర్ ఇండియా విమానాల్లో కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్లతో ప్రయాణించిన సంఘటనలు రెండు జరిగినందున దుబాయ్ పౌరవిమానయాన శాఖ ఈ ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. 

Updated Date - 2020-09-18T18:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising