ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణసంచా పేలి రెండంతస్థుల భవనం ధ్వంసం... ఒకరు దుర్మరణం

ABN, First Publish Date - 2020-09-26T16:18:12+05:30

యూపీలోని మధుర పరిధిలో గల సురీర్ ప్రాంతంలో బాణసంచా పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన బాణసంచా పేలడంతో రెండస్థుల భవనం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర: యూపీలోని మధుర పరిధిలో గల సురీర్ ప్రాంతంలో బాణసంచా పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన బాణసంచా పేలడంతో రెండస్థుల భవనం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చారు.



రానున్న దీపావళి సందర్బంగా పటాకులు తయారు చేసేందుకు జోగేంద్ర సింగ్ అనే వ్యక్తి తన ఇంట్లో మందుగుండు సామానుతో పాటు బాణసంచాను అక్రమంగా నిల్వ చేశాడు. రెండవ అంతస్థులో నిల్వ ఉంచిన ఈ సామగ్రి అర్ధరాత్రి ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ రెండస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా కలకలం చెలరేగింది. ఈ ఘటనలో వ్యాపారి జోగేంద్ర మృతి చెందాడు. అతని భార్యాపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-26T16:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising