ఆర్టికల్ 370 పునరుద్ధరణపై సుప్రీం తీర్పును జోస్యం చెప్పొద్దు : ఒమర్ అబ్దుల్లా
ABN, First Publish Date - 2020-10-25T19:49:21+05:30
కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై సుప్రీం కోర్టు తీర్పును ముందుగానే జోస్యం చెప్పాల్సిన అవసరం లేదని నేషనల్ కాన్ఫెరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు...
కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై సుప్రీం కోర్టు తీర్పును ముందుగానే జోస్యం చెప్పాల్సిన అవసరం లేదని నేషనల్ కాన్ఫెరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ఇక జరగదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శనివారం చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆయన ఇలా సమాధానమిచ్చారు. సుప్రీం కోర్టు ఈ విషయంలో రాజ్యాంగం ప్రకారమే సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని అబ్దుల్లా బదులిచ్చారు.
Updated Date - 2020-10-25T19:49:21+05:30 IST