అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దు : కేంద్రం
ABN, First Publish Date - 2020-08-22T22:48:03+05:30
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను కోవిడ్-19 ఆంక్షల పరిథిలోకి తేవద్దని కోరారు. కేంద్రం ఇటువంటి సూచనలు గతంలో కూడా చేసిన సంగతి తెలిసిందే.
అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకు రవాణాను ఆపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2020-08-22T22:48:03+05:30 IST