మాస్కులు స్వయంగా కుట్టి పంచుతున్న కేంద్ర మంత్రి భార్య, కుమార్తె
ABN, First Publish Date - 2020-04-09T19:38:12+05:30
భువనేశ్వర్: కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య, కుమార్తె మాస్కులు స్వయంగా కుట్టి పంచుతూ ఆదర్శంగా నిలిచారు.
భువనేశ్వర్: కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య, కుమార్తె మాస్కులు స్వయంగా కుట్టి పంచుతూ ఆదర్శంగా నిలిచారు. ట్విటర్లో ఫొటోలు షేర్ చేసిన ఆయన తన భార్య మృదుల, కుమార్తె నైమిషకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కష్టకాలంలో సమాజానికి తోడ్పడేందుకు యత్నిస్తున్నారని ప్రశంసించారు. మాస్కులు తయారుచేస్తూ అవసరమైనవారికి పంచడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. నైపుణ్యాలకు పదునుపెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాన్ కామెంట్ పెట్టారు.
తోటివారికి సాయపడేందుకు ముందుకొచ్చిన మృదుల, నైమిషిలను అంతా అభినందిస్తున్నారు.
Updated Date - 2020-04-09T19:38:12+05:30 IST