ధనుష్కోటి తీరానికి కొట్టుకొచ్చిన భారీ పరికరం
ABN, First Publish Date - 2020-10-01T17:19:01+05:30
ధనుష్కోటి తీరానికి నీటిలో తేలియాడే భారీ పరికరం కొట్టుకొచ్చింది.
చెన్నై : ధనుష్కోటి తీరానికి నీటిలో తేలియాడే భారీ పరికరం కొట్టుకొచ్చింది. రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి ఒత్తకాలై సముద్ర తీరానికి ఓ నల్లటి భారీ పరికరం కొట్టుకు రావడాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. రామేశ్వరం మైరెన్ స్టేషన్ సీఐ కనకరాజ్ నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ పరికరాన్ని పరిశీలించారు. రెండు టన్నుల బరువుతో రబ్బరుతో చేయబడిన నీటిలో తేలియాడే పరికరంగా గుర్తించారు.
భారీ నౌకలను హార్బర్ ప్రాంతంలో నిలిపే సమయంలో అలల వేగాన్ని అడ్డ్డుకొనేలా ఈ పరికరాన్ని నౌక వెనుక భాగంలో ఏర్పాటుచేస్తారని, అలాగే, సముద్ర మార్గాన్ని గుర్తించేందుకు కూడా ఈ పరికరాన్ని వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ పరికరం తూత్తుకుడి హార్బర్ నుంచి వచ్చిందా? లేక మధ్య సముద్రం నుంచి వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
Updated Date - 2020-10-01T17:19:01+05:30 IST