రాబోయే కాలంలో ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం: కేజ్రీవాల్
ABN, First Publish Date - 2020-08-05T16:56:25+05:30
అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీర్వాద బలంతో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిందని కేజ్రీవాల్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. అయోధ్య భూమిపూజ సందర్భంగా యావత్ దేశానికి శుభాభినందనలు. శ్రీరాముని ఆశీర్వాదం మనకు కలగాలి. ఆయన ఆశీర్వాదంతో మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం నుంచి బయటపడి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది. రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుంది. జై శ్రీ రామ్! జై బజరంగ్ బళి!... అని రాశారు.
Updated Date - 2020-08-05T16:56:25+05:30 IST