‘బోయింగ్’ నడపడంలో దిట్ట.. దీపక్ సాథే
ABN, First Publish Date - 2020-08-08T07:23:48+05:30
దీపక్ వసంత్ సాథే.. కేరళలో ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లలో ఒకరు. ఆయన గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్21)పైలట్గా పనిచేశారు...
- ఎయిర్ఫోర్స్ నుంచి ఎయిరిండియాలోకి..
న్యూఢిల్లీ, ఆగస్టు 7: దీపక్ వసంత్ సాథే.. కేరళలో ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లలో ఒకరు. ఆయన గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్21)పైలట్గా పనిచేశారు. ఎయిర్ఫోర్స్ అకాడమీలో పైలట్ కోర్సును ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ గౌరవంతో పూర్తిచేశారు. 2003లో వాయుసేన నుంచి రిటైరయ్యారు. అనంతరం 2005లో ఎయిరిండియాలో జాయినయ్యారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో ఆయన దిట్ట. అంకితభావం, అపారమైన నైపుణ్యం సాథే సొంతమని, గతంలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించారని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2020-08-08T07:23:48+05:30 IST