శిశువు ఆకలి తీర్చిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
ABN, First Publish Date - 2020-06-05T08:19:44+05:30
రైలులో తల్లి ఒడిలో ఆకలితో ఏడుస్తున్న శిశువుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ యాదవ్ పాల ప్యాకెట్ అందించి ఆకలి తీర్చాడు. హసీన్ హష్మీ, షరీఫ్ హష్మీ దంపతులు తమ నాలుగు నెలల బిడ్డతో కర్ణాటకలోని బెల్గాం నుంచి శ్రామిక్ రైళ్లో యూపీలోని గోరఖ్పూర్కు...
- అభినందించిన రైల్వే మంత్రి
- నగదు రివార్డు ప్రకటన
న్యూఢిల్లీ, మే 4: రైలులో తల్లి ఒడిలో ఆకలితో ఏడుస్తున్న శిశువుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ యాదవ్ పాల ప్యాకెట్ అందించి ఆకలి తీర్చాడు. హసీన్ హష్మీ, షరీఫ్ హష్మీ దంపతులు తమ నాలుగు నెలల బిడ్డతో కర్ణాటకలోని బెల్గాం నుంచి శ్రామిక్ రైళ్లో యూపీలోని గోరఖ్పూర్కు వెళ్తున్నారు. ఆకలికి తట్టుకోలేక శిశువు ఏడుస్తుండటంతో ఆ తల్లి కానిస్టేబుల్కు పరిస్థితిని వివరించి, ఎలాగైనా పాల ప్యాకెట్ తీసుకురావాలని వేడుకుంది. యాదవ్ స్టేషన్లో దిగి.. బయటకు వెళ్లి పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చేంతలో రైలు కదిలింది. వెనకాలే చాలా దూరం పరుగెత్తిన యాదవ్, ఎట్టకేలకు రైలును అం దుకొని పాలప్యాకెట్ను తల్లిదండ్రులకు ఇచ్చాడు. యాదవ్ గొప్ప ధైర్యాన్ని, మానవత్వాన్ని ప్రదర్శించాడని మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. ఆయనకు ప్రత్యేకంగా నగదు రివార్డును అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - 2020-06-05T08:19:44+05:30 IST