ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ABN, First Publish Date - 2020-03-25T21:01:11+05:30

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కరోనా వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయని, భారత్‌లో కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు, నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయన్నారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. రూ.2 కే కిలో గోధుమలు అందిస్తామని జవదేకర్‌ తెలిపారు.

Updated Date - 2020-03-25T21:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising