ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లాక్‌డౌన్ అమలుకు డ్రోన్లతో పోలీసుల నిఘా

ABN, First Publish Date - 2020-03-26T17:57:27+05:30

దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముంబై నగరంలో దీన్ని అమలుచేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముంబై నగరంలో దీన్ని అమలుచేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ముంబై వీధుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతూ ప్రచారం చేయడంతో పాటు ఎవరూ బయటకు రాకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. ‘‘సోదర, సోదరీమణులారా, నగరంలో ఏప్రిల్ 14వతేదీ వరకు కర్ఫ్యూ విధించాం..ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు, కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇళ్లలోనుంచి బయటకు రాకుండా ఉండటం ఒక్కటే పరిష్కారం, ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా ఇళ్లలోనుంచి బయటకు వస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు పెడతాం’’ అని ముంబై పోలీసులు హెచ్చరించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-03-26T17:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising