సంస్థలు తమ సిబ్బంది కోసం కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేయవచ్చు.., అయితే...
ABN, First Publish Date - 2020-10-04T16:55:30+05:30
దేశంలోని పెద్దపెద్ద కంపెనీలు తన సిబ్బంది కోసం కరోనా వ్యాక్సిన్ ను నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కోనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. దీనిపై కసరత్తు చేస్తున్న అధికారులు తెలిపిన వివరాల...
న్యూఢిల్లీ: దేశంలోని పెద్దపెద్ద కంపెనీలు తన సిబ్బంది కోసం కరోనా వ్యాక్సిన్ ను నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కోనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. దీనిపై కసరత్తు చేస్తున్న అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలో టీకాల వ్యాక్సినేషన్ను సాధారణంగా ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తుంటాయి. ఇప్పుడు ఈ విధంగా కరోనా వ్యాక్సినేషన్కు రూ. 50 వేల కోట్లు ఖర్చుకానుంది. కాగా పలువురు వైద్య విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం 2021లో దేశంలోని ప్రతీఒక్కరికీ వ్యాక్సిన్ అందే పరిస్థితులు లేవు. కాగా దేశంలోని కంపెనీలు తమ సిబ్బంది కోసం వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. అయితే దీని అమలుకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాల్సివుందని తెలుస్తోంది.
Updated Date - 2020-10-04T16:55:30+05:30 IST