ఉపరితలాల శానిటైజేషన్కు ఎల్ఇడి టెక్నాలజీ
ABN, First Publish Date - 2020-04-08T07:06:40+05:30
కరోనాపై పోరులో ఐఐటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐఐటీ గౌహతి ఉపరితలాన్ని క్రిమిరహితంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడే అల్ర్టావయిలెట్(యువీసీ) లెడ్ ఆధారిత మెషిన్ను రూపొందించింది.
కరోనాపై పోరులో ఐఐటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐఐటీ గౌహతి ఉపరితలాన్ని క్రిమిరహితంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడే అల్ర్టావయిలెట్(యువీసీ) లెడ్ ఆధారిత మెషిన్ను రూపొందించింది. ఉపరితలాన్ని శానిటైజేషన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన టెక్నాలజీ యువీసీ. దీని ద్వారా 90 శాతం క్రిములను నశింప చేయవచ్చు. ఇందుకు 186 జౌల్స్ థర్మల్ డోస్ అవసరం. కానీ కరోనా వంటి వైరస్ విషయంలో 36 జౌల్స్ థర్మల్ డోస్ సరిపోతుంది. ప్రస్తుతం ఐఐటీ గౌహతి పరిశోధకులు తయారు చేసిన ఈ లెడ్ మెషిన్ 30 సెకన్లలో 400 జౌల్స్ థర్మల్ డోస్ ఉత్పత్తి చేస్తుంది. ఆస్పత్రులు, బస్సులు, రైళ్లు వంటి చోట్ల ఉపరితలాన్ని శానిటైజేషన్ చేసేందుకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.
కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తితో తయారు చేసిన ఈ మెషిన్ ఖరీదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. యువీసీ టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని వినియోగించే సమయంలో మానవ శరీరానికి ఎటువంటి హాని కలగని విధంగా ప్రత్యేకమైన ఫీచర్ను ఇందులో పొందుపరిచారు. కరోనాపై పోరులో ఉపరితలాలను క్రిమిరహితంగా ఉంచుకోవడం ముఖ్యం. రానున్న రోజుల్లో ప్రధానంగా లాక్ డౌన్ను ఎత్తివేసిన తర్వాత బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచేందుకు ఈ మెషిన్ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. డోర్ హాండిల్స్, ప్లాస్టిక్ పూత లేదా లామినేటెడ్ ఫర్నిచర్, గట్టిగా ఉండే ఉపరితలాలపై కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Updated Date - 2020-04-08T07:06:40+05:30 IST