ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19తో ఇటలీ ప్రధాని భద్రతాధికారి మృతి

ABN, First Publish Date - 2020-04-05T01:06:40+05:30

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే భద్రతాధికారుల్లో ఒకరు ఇవాళ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత నెల 21న మృతుడు జార్జియో గుస్టామాచియా (52) కరోనా బారిన పడినట్టు గుర్తించామని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి ఆయనను ప్రధాని భద్రతా విధుల నుంచి తప్పించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. గత రెండు వారాలుగా ప్రధానికి గుస్టామాచియా దూరంగా ఉన్నట్టు పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా 55 ఏళ్ల ప్రధాని కాంటేకి కూడా పరీక్షలు జరిపామనీ.. అయితే ఆయనకు కోవిడ్-19 నెగిటివ్‌ అని తేలిందని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా ఇటలీ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 1.19 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడగా.. 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-04-05T01:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising