ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూబేతో జీపులో ప్రయాణించిన కానిస్టేబుల్‌కు కరోనా!

ABN, First Publish Date - 2020-07-12T22:43:37+05:30

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిన్ నుంచి యూపీకి తరలించబోయిన జీపులో ప్రయాణించిన ఓ కానిస్టేబుల్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిన్ నుంచి యూపీకి తరలించబోయిన జీపులో ప్రయాణించిన ఓ కానిస్టేబుల్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీనికి సంబంధించిన రిపోర్టు శనివారం రాత్రి వచ్చినట్లు యూపీ పోలీసు శాఖ అధికారులు వెల్లడించారు. సదరు కానిస్టేబుల్‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన వివరాలను కాన్పూర్‌లోని ఎల్‌ఎల్ఆర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కమల్ ధ్రువీకరించారు. దూబేని యూపీకి తరలించబోయిన వాహనంలో సదరు కానిస్టేబుల్‌తోపాటు ఉన్న మరో నలుగురికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరందరికీ నెగిటివ్ ఫలితం వచ్చినట్లు సమాచారం. యూపీకి వస్తుండగా ఈ వాహనానికి యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో తన చేతికి లభించిన తుపాకీ తీసుకొని దూబే పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-07-12T22:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising