రాజ్యసభ ఎన్నికల వేళ సొంత పార్టీకి షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ABN, First Publish Date - 2020-06-04T19:08:07+05:30
గాంధీనగర్: రాజ్యసభ ఎన్నికల వేళ సొంత పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాకిచ్చారు.
గాంధీనగర్: రాజ్యసభ ఎన్నికల వేళ సొంత పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాద ఎమ్మెల్యే జితూ చౌదరి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అప్పగించారు. వీరి రాజీనామాలను ఆయన వెంటనే ఆమోదించారు. అంతకు ముందు మార్చి నెలలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 103 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 19న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీనుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. బీజేపీ తరపున అభయ్ భరద్వాజ్, రమిలా బరా, నరహరి అమిన్ పోటీ చేస్తుండగా శక్తికాంత్ గోహిల్, భరత్ సింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీ తపున పోటీ చేస్తున్నారు.
గుజరాత్ నుంచి నలుగురు మాత్రమే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశాలున్నాయి.
Updated Date - 2020-06-04T19:08:07+05:30 IST