4,000 చదరపు అడుగుల్లో భారీ త్రివర్ణ పతాకాన్ని వేసిన విద్యార్థులు
ABN, First Publish Date - 2020-08-15T18:59:03+05:30
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని సప్తగిరి ఇంజినీరింగ్ కాలేజీ వినూత్నంగా
బెంగళూరు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని సప్తగిరి ఇంజినీరింగ్ కాలేజీ వినూత్నంగా దేశ భక్తిని చాటుకుంది. 4,000 చదరపు అడుగుల్లో భారీ త్రివర్ణ పతాకాన్ని వేశారు. దీనికి 250 కిలోల రంగు ముగ్గులను, నాలుగు టన్నుల ఉప్పుతో పాటు 400 కిలోల పుష్పాలను ఉపయోగించారు. ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని గీయడానికి 50 మంది విద్యార్థులు, 100 మంది ఫ్యాకల్టీ మెంబర్లు కష్టపడ్డారు. వీరితో పాటు కరోనా వారియర్స్ కూడా పాల్గొన్నారు. వీరిని కాలేజీ యాజమాన్యం సత్కరించింది.
Updated Date - 2020-08-15T18:59:03+05:30 IST