ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయంబత్తూర్‌లో కరోనా విజృంభణ.. ఒక్క అయ్యప్పనగర్‌లోనే..

ABN, First Publish Date - 2020-07-07T05:06:06+05:30

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజే ఈ జిల్లాలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగించింది. సెల్వపురంలోని అయ్యప్పనగర్‌లోనే 34 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో.. సెల్వపురంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డోర్ టూ డోర్ సర్వే చేసి కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించనున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి.


అయ్యప్పనగర్‌లో ఇప్పటివరకూ 114 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉన్న 60 మంది కరోనా పేషంట్స్‌ను కొడిసియా ఫెయిర్ కాంప్లెక్స్‌లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. వీరిలో 40 మంది పురుషులు, 20 మంది మహిళలు. వీరెవరిలో కోవిడ్-19 లక్షణాలేవీ లేవు. కానీ.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. కోయంబత్తూర్ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 802కు చేరింది.

Updated Date - 2020-07-07T05:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising