త్వరలో చైనా అధ్యక్షుడి పాక్ పర్యటన!
ABN, First Publish Date - 2020-08-14T04:01:32+05:30
చైనా అధ్యక్షుడు త్వరలో పాక్లో పర్యటించనున్నారని సమాచారం. పాక్, చైనాల మధ్య ఏటా జరిగే వ్యూహాత్మక మండలి సమావేశాల కోసం సెప్టెంబర్ నెలలో అధ్యక్షుడు జీ జింగ్పింగ్ పాక్లో పర్యటించనున్నారు.
ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ త్వరలో పాక్లో పర్యటించనున్నారని సమాచారం. పాక్, చైనాల మధ్య ఏటా జరిగే వ్యూహాత్మక మండలి సమావేశాల కోసం సెప్టెంబర్లో అధ్యక్షుడు జీ పాక్లో పర్యటించనున్నారట. ఈ సమావేశం జూన్ నెలలో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతకుమునుపు.. 2015లో జీ పాక్లో పర్యటించారు. అపట్లో ఇరు దేశాలూ తమ బంధాన్ని సర్వకాల వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణిస్తూ దౌత్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్తో చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో జీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక.. సీపీఈసీ కారిడార్ కోసం చైనా పాక్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం కూడా జీ పర్యటనలో ప్రధానాంశం కానుందని సమాచారం.
Updated Date - 2020-08-14T04:01:32+05:30 IST