కరోనా సంక్షోభంపై శ్వేత పత్రం విడుదల చేసిన చైనా!
ABN, First Publish Date - 2020-06-07T20:50:44+05:30
కరోనా సంక్షోభానికి చైనాయే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న అక్కడి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కరోనా విషయంలో తాము సమయానుకూలంగా, వేగంగా స్పందించామంటూ తనకు తానే సర్టిఫేకేట్ ఇచ్చుకుంది. సంక్షోభం తలెత్తిన నాటి నుంచి చైనాలో తీసుకున్న చర్యలపై అక్కడి ప్రభుత్వం ఇటీవల శ్వేత పత్రం విడుదల చేసింది.
బీజింగ్: కరోనా సంక్షోభానికి చైనాయే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కరోనా విషయంలో తాము సమయానుకూలంగా, వేగంగా స్పందించామంటూ తనకు తానే సర్టిఫేకేట్ ఇచ్చుకుంది. సంక్షోభం తలెత్తిన నాటి నుంచి చైనాలో తీసుకున్న చర్యలపై అక్కడి ప్రభుత్వం తాజాగా శ్వేత పత్రం విడుదల చేసింది.
తొలి కేసు నమోదైన నాటి నుంచి పకడ్బందీ చర్యలు చేపట్టామని, ప్రపంచానికి, డబ్ల్యూహెచ్ఓకూ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని స్పష్టం చేసిన చైనా.. ఈ మహమ్మారికి ప్రబలడానికి తాను కారణం కాదని చెప్పకనే చెప్పింది.
శ్వేత పత్రంలో ప్రకటించిన వివరాల ప్రకారం.. కరోనాను పోలిన తొలి కేసు డిపెంబర్ 27 వుహాన్లో బయటపడింది. దీంతో హూబే ప్రావిన్స్లోని స్థానిక ప్రభుత్వం వెనువెంటనే అంటువ్యాధుల నిపుణులను రంగంలోకి దిపింది. ల్యాబోరేటరీ పరీక్షల ఫలితాలు, పేషెంట్ల స్థితిగుతులను వారి సహాయంతో విస్లేషించింది. అనంతరం.. నిపుణులు దీన్ని వైరల్ నిమోనియాగా గుర్తించారు. ఇక జాతీయ ఆరోగ్య కమిషన్ నిపుణులు.. ఇది మనుషుల ద్వారా వ్యాపించే వ్యాధిఅని జనవరి 19న తొలిసారిగా గుర్తించారు. అదే రోజు ఈ వివరాలను బహిర్గతం చేశారు.
నెల రోజుల లోపునే ఈ మహమ్మారికి సంబంధించి వివరాలను బహిర్గతం చేశారు. కాగా.. జనవరి ప్రకటనకు ముందు ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాపిస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని చైనా అంటు వ్యాధులు నిపుణుడు తెలిపారు. అది అస్పష్టత రాజ్యమేలుతున్న సమయమని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ ఆరోగ్య కమిషన్ ఆధ్వర్యంలోని అంటువ్యాధి నిపుణుల బృందానికి వాంగ్ నేతృత్వం వహించారు.
నిపుణుల బృందం వుహాన్ చేరుకునే సమయానికే రోగుల సంఖ్య పెరిగిపోయిందని, అయితే రోగుల్లో ఎవరికీ అడవి జంతువుల మార్కెట్తో సంబంధం ఉన్నట్టు తేలలేదని ఆయన చెప్పుకొచ్చారు. అడవి జంతువుల నుంచి వైరస్ మనుషులకు పాకినట్టు ప్రపంచ మంతా భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హూబే ప్రావిన్స్, దానికి కేంద్రమైన వుహాన్లో వ్యాధి కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక ప్రభుత్వాలకు జనవరి 14నే సూచించామని తెలిపారు. ఇది మనుషుల ద్వారా సంక్రించే వ్యాధి అంటూ ప్రభుత్వం జనవరి 20న ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓ అంటు వ్యాధి వుహాన్లో ప్రబలుతోందని, ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని తెలియగానే దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి పటిష్ట కార్యాచరణ అవలంబించినట్టు చైనా ప్రభుత్వం శ్వేత పత్రంలో వెల్లడించింది. జనవరి 3 నుంచీ అంటే.. కరోనాను ఓ వైరల్ నిమోనియా వ్యాధిగా భావిస్తున్నప్పటి నుంచీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు, ఆ తరువాత అమెరికాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించామని తేల్చేసింది.
ఇక కరోనా కట్టడిలో ముఖ్యపాత్ర పోషించారన చైనా అధినేత జీ జింగ్పింగ్పై కూడా శ్వేత పత్రం ప్రసంశల వర్షం కురిపించింది. కరోనా కట్టడి అనేది దేశం సాధించిన వ్యూహాత్మక విజయంగా అభివర్ణించింది.
Updated Date - 2020-06-07T20:50:44+05:30 IST