ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లోని తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

ABN, First Publish Date - 2020-05-26T02:29:12+05:30

కరోనా వైరస్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తరలించనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తరలించనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా ఎంబసీ వెబ్‌సైట్‌ పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను తరలించనున్నట్టు తెలిపింది. స్వదేశానికి రావాలనుకున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరిగి టాప్-10 దేశాల్లో చేరడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 


భారత్‌లో కరోనా వైరస్ కేసులు 1.50 లక్షలకు చేరువయ్యాయి. మరణాలు 4 వేలు దాటేశాయి. కాగా, చైనాలో వైరస్ వెలుగు చూసిన వెంటనే వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను జనవరి-ఫిబ్రవరిలో కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. కాగా, గత వారం భారత ప్రభుత్వం దేశంలో చిక్కుకుపోయిన వివిధ దేశాలకు చెందిన 60 వేల మంది ప్రత్యేక విమానాల ద్వారా వారి సొంత దేశాలకు చేర్చింది.

Updated Date - 2020-05-26T02:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising