చైనా దూకుడుకు భారత్ ముకుతాడు వేసింది : అమెరికా
ABN, First Publish Date - 2020-07-09T03:00:45+05:30
భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చాలా దూకుడు
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చాలా దూకుడు ప్రదర్శించిందని, దానికి భారత దేశం అత్యుత్తమంగా స్పందించిందని అమెరికా పేర్కొంది.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియో భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల గురించి బుధవారం మాట్లాడుతూ, దీని గురించి తాను భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో చాలాసార్లు మాట్లాడానని చెప్పారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరించిందని, దానికి భారతీయులు అత్యుత్తమంగా స్పందించారని పేర్కొన్నారు.
పొరుగు దేశాలతో భౌగోళిక వివాదాలను చైనా రెచ్చగొడుతోందన్నారు. ప్రపంచం ఈ బెదిరింపులను అనుమతించరాదన్నారు.
భూటాన్తో సరిహద్దు వివాదాన్ని తాజాగా చైనా లేవనెత్తిందని, హిమాలయ పర్వతాల దగ్గర నుంచి వియత్నాం జలాల వరకు, సెంకాకు దీవులు, ఆ పై వరకు చైనా భౌగోళిక వివాదాలను రెచ్చగొడుతోందని పేర్కొన్నారు. చైనా బెదిరింపులను ప్రపంచం అంగీకరించరాదని స్పష్టం చేశారు. చైనా వైఖరిని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.
Updated Date - 2020-07-09T03:00:45+05:30 IST