ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ 4.0 పై నేడు మార్గదర్శకాల విడుదల!

ABN, First Publish Date - 2020-05-17T17:43:59+05:30

గత మూడు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కార్యాలయంలో పలు దఫాలుగా హోంశాఖ సీనియర్ అధికారులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనలపై కేంద్ర హోంశాఖ నేడు మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కార్యాలయంలో పలు దఫాలుగా హోంశాఖ సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండ్రోజులుగా అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా అమిత్‌షా నాలుగోదశ నిబంధనలపై మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.


నాలుగో దశ లాక్‌డౌన్‌కు ప్రజలు సిద్ధంగా ఉండాలని, అయితే ఈ దశ లాక్‌డౌన్ మాత్రం సరికొత్తగా ఉంటుందని ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు కూడా. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ సలహాలు, సూచనలను ఇప్పటికే కేంద్రానికి సూచించారు. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకొని, ఒకచోట క్రోడీకరించి నాలుగో దశ మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.


మూడోదశ లాక్‌డౌన్ ఈ నెల 17 తో ముగిసింది. 18 తేదీ నాటికే నాలుగో దశ లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు దఫాలుగా సీనియర్ అధికారులతో చర్చిస్తూ ఉండటం, ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో మార్గదర్శకాల విడుదలలో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా.... ఆదివారం సాయంత్రానికి కేంద్ర హోంశాఖ నాలుగో దశ మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. 

Updated Date - 2020-05-17T17:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising