చైనాతో ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం కీలక ఆదేశాలు..
ABN, First Publish Date - 2020-06-18T15:42:17+05:30
చైనా దురాగతాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దేశంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: చైనా దురాగతాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దేశంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సంస్థను పునరుత్తేజితం చేసేందుకు 4జీ వ్యవస్థలను అప్గేడ్ర్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్కు కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పనుల కోసం టెండర్లు వేసేందుకు ప్రవేటు సంస్థలను ఆహ్వానించాలని కూడా బీఎస్ఎన్ఎల్ నిర్ణయించినట్టు సమాచారాం. అయితే అప్గ్రేడ్ కోసం చైనా ఉత్పత్తులను ఉపయోగించరాదంటూ బీఎస్ఎన్ఎల్కు టెలికాం శాఖ ఉత్తర్వులు త్వరలో జారి చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు టెండర్ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా టెలికాం శాఖ సూచించనున్నట్టు తెలుస్తోంది. ఎమ్టీఎన్ఎల్కు కూడా ఇదే తరహా సూచనలు త్వరలో అందుతాయట.
Updated Date - 2020-06-18T15:42:17+05:30 IST